గోపాల్ పూర్
భారత నౌకాదళ నౌక (ఐ.ఎన్.ఎస్) ఖంజర్ ఒడిశాలోని వారసత్వ సముద్ర తీర ఓడరేవు అయిన గోపాల్ పూర్ లోకి వచ్చిన మొదటి భారత నౌకాదళం యొక్క నౌకగా అవతరించింది. భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 2021, ఆగస్టు 2 న ముగిసిన రెండు రోజుల పర్యటనలో ఇది పాల్గొన్నది.
గోపాల్ పూర్ గురించి:
గోపాల్ పూర్ ఒక సముద్ర తీర పట్టణం మరియు ఒడిషాకు దక్షిణ భాగంలో గంజాం జిల్లాలోని బంగాళాఖాత తీరంలో ఉన్న ఒక నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్.
ప్రాచీన కాలంలో గోపాల్ పూర్ ప్రాచీన కళింగ దేశ సముద్రయానానికి ముఖ్యమైన ఓడరేవుగా పనిచేసింది. ఇది గోపాల్ పూర్ సమీపంలో ఉన్న మన్సూర్ కోట, రుషికుల్య నది ముఖద్వారానికి దిగువన గుర్తించబడింది.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కూడా, ఇక్కడి నుంచి సైనికులు బర్మాకు ప్రయాణం చేసే ఒక ప్రాముఖ్యమైన సైనిక ఓడరేవు.
Source : All India Radio/ Geography
0 Comments