చైనాతో భారత్ వాణిజ్య లోటు

చైనాతో భారత వాణిజ్య లోటు 2018-19లో 53.57 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 2020-2021లో 44.02 బిలియన్ అమెరికన్ డాలర్లకు తగ్గింది. ఈ సమాచారాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో పేర్కొన్నారు.


ఈ వాణిజ్య లోటు గురించి:

  1. చైనాకు భారతదేశం నుండి ఎగుమతులు 2019-20 లో 16.61 బిలియన్ డాలర్ల నుండి 2020-21 లో 21.19 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2018-19 లో 16.75 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేశారు.

  2. 2018-19, 2019-20 మరియు 2020-21 కాలంలో చైనా నుండి  భారతదేశ దిగుమతుల విలువ వరుసగా 70.32 బిలియన్ డాలర్లు, 65.26 బిలియన్ డాలర్లు మరియు 65.21 బిలియన్ డాలర్లు.


Source : Business Standard/ International