టోక్యో ఒలింపిక్స్‌లో తొలి రోజే ఇండియా ప‌త‌కాల బోణీ కొట్టింది. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచింది.

  • కరణం మల్లీశ్వరి తర్వాత బరువులు ఎత్తడంలో భారత్‌కు పతకం అందించింది మీరాభాయి చాను. దాదాపుగా 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకంను శిఖరాగ్రాలకు చేర్చింది. 

  • స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది. 


  • సిడ్నీ ఒలింపిక్స్‌లో మన తెలుగు తేజం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ్రాంజ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. ఇప్పుడు మీరాబాయ్ సిల్వ‌ర్‌తో మెరిసింది.

  • చైనా వెయిట్‌లిఫ్ట‌ర్ హౌ ఝిఝి 210 కేజీల‌తో గోల్డ్ మెడ‌ల్ గెలిచింది.

  • ఇండోనేషియాకు బ్రాంజ్ మెడ‌ల్ ద‌క్కింది. 

  • గోల్డ్ కోసం క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయ్ చివ‌రి ప్ర‌య‌త్నంలో 117 కేజీల బ‌రువు ఎత్త‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది.

  • Source:e News /Sports